కిషన్రెడ్డి.. దమ్ముంటే కంటోన్మెంట్లో ఫ్లై ఓవర్లు కట్టించు: కేటీఆర్
ABN, First Publish Date - 2022-06-21T17:50:58+05:30
హైదరాబాద్ నగర వ్యాప్తంగా మొదటి దశ ఎస్ఆర్డీపీ(SRDP) కింద 8052 కోట్ల రూపాయలతో 47 ప్రాజెక్టులు చేపట్టామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
హైదరాబాద్ : హైదరాబాద్ నగర వ్యాప్తంగా మొదటి దశ ఎస్ఆర్డీపీ(SRDP) కింద 8052 కోట్ల రూపాయలతో 47 ప్రాజెక్టులు చేపట్టామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఇప్పటి వరకూ 30 అందుబాటులోకి వచ్చాయన్నారు. 3117 కోట్ల రూపాయలతో రెండో దశ ఎస్ఆర్డీపీ మొదలు పెడతామన్నారు. దేశ నలుమూలల నుంచి వచ్చి హైదరాబాద్లో నివాసముంటున్నారు. జనాభాకు తగ్గట్టు వసతులు కల్పిస్తున్నామన్నారు. కూకట్పల్లి IDPLలో ఎందుకు రోడ్లు వేస్తున్నారని... ఇక్కడి కేంద్ర మంత్రి అడగటమే కాకుండా కేసులు పెడతా అంటున్నాడన్నారు. కిషన్ రెడ్డికి దమ్ముంటే.. కంటోన్మెంట్లో ఫ్లై ఓవర్లు కట్టించాలని కేటీఆర్ సవాల్ విసిరారు.
Updated Date - 2022-06-21T17:50:58+05:30 IST