విచారణ సమయంలో నేను ఏం మాట్లాడను: కిషన్రెడ్డి
ABN, First Publish Date - 2022-08-23T23:03:07+05:30
విచారణ సమయంలో నేను ఏం మాట్లాడను: కిషన్రెడ్డి
హైదరాబాద్: బండి సంజయ్ పాదయాత్రను అడ్డుకోవడాన్ని కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఖండించారు. ప్రగతిభవన్ కుట్రలో భాగంగానే సంజయ్ని అడ్డుకున్నారని ఆరోపించారు. కుటుంబ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. ప్రధాని మోదీ ఏరోజూ కేసీఆర్పై వ్యక్తిగత విమర్శలు చేయలేదన్నారు. లిక్కర్ స్కామ్లో కవితపై విచారణ జరుగుతోందన్నారు. విచారణ చేయడం దర్యాప్తు సంస్థల పని అని ఆయన పేర్కొన్నారు. విచారణ సమయంలో తాను ఏం మాట్లాడనని స్పష్టం చేశారు.
Updated Date - 2022-08-23T23:03:07+05:30 IST