Bhadradri: భద్రాద్రి రామాలయంలో సహస్రనామ కుంకుమార్చన పూజలు
ABN, First Publish Date - 2022-08-05T13:20:32+05:30
శ్రావణ మాసం రెండవ శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా భద్రాద్రి రామాలయంలో ...
భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా: శ్రావణ మాసం రెండవ శుక్రవారం వరలక్ష్మి వ్రతం (Varalakshmi Vratam) సందర్భంగా భద్రాద్రి రామాలయంలో ఈ రోజు సాయంత్రం 4 గంటలకు సామూహిక సహస్రనామ కుంకుమార్చన పూజా కార్యక్రమం జరగనుంది. శుక్రవారం ఉదయం సామూహిక వరలక్ష్మి వ్రతం కనులపండువగా జరుగుతోంది. రామాలయంలో స్వర్ణాలంకృతులైన మూలమూర్తులకు అర్చకులు సుప్రభాతం నిర్వహించి నామార్చనలు చేసి ఆరాధించారు. భక్తులు అమ్మవారికి వ్రత పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు.
Updated Date - 2022-08-05T13:20:32+05:30 IST