ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘వనమా రాఘవను కఠినంగా శిక్షించాలి’

ABN, First Publish Date - 2022-01-07T05:29:05+05:30

రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసేందుకు కారణమైన టీఆర్‌ఎస్‌ నాయకుడు వనమా రాఘవను కఠినంగా శిక్షించాలని ఐద్వా పట్టణ అధ్యక్షురాలు జ్యోతి డిమాండ్‌ చేశారు. భద్రాచలంలో గు రువారం జరిగిన సమావేశంలో పట్టణ కార్యదర్శి డి.సీతాలక్ష్మి మాట్లాడుతూ వనమా రాఘవపై రౌడీషీట్‌ తెరవాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు నాదెళ్ల లీలావతి, సున్నం గంగ, ఆఫీసు బేరరు జి.జీవనజ్యోతి, ఎ.సక్కుబాయి పాల్గొన్నారు.

నిరసన తెలుపుతున్న ఐద్వా నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భద్రాచలం, జనవరి 6: రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసేందుకు కారణమైన టీఆర్‌ఎస్‌ నాయకుడు వనమా రాఘవను కఠినంగా శిక్షించాలని ఐద్వా పట్టణ అధ్యక్షురాలు జ్యోతి డిమాండ్‌ చేశారు. భద్రాచలంలో గు రువారం జరిగిన సమావేశంలో పట్టణ కార్యదర్శి డి.సీతాలక్ష్మి మాట్లాడుతూ వనమా రాఘవపై రౌడీషీట్‌ తెరవాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు నాదెళ్ల లీలావతి, సున్నం గంగ, ఆఫీసు బేరరు జి.జీవనజ్యోతి, ఎ.సక్కుబాయి పాల్గొన్నారు.

వనమా రాఘవను కఠినంగా శిక్షించాలి: ఎన్డీ

మణుగూరు, జనవరి 6:  మీ సేవా నిర్వాహకుడు రా మకృష్ణ కుటుంబంలోని నలుగురు మృతికి కారకుడైన కొ త్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఎన్డీ సబ్‌డివిజన్‌ నాయకులు రవి, డిమాండ్‌ చేశారు. గు రువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వన మా రాఘవపై రౌడీషీట్‌ ఓపెన్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జగ్గన్న, రాము పాల్గొన్నారు.

రాఘవ లాంటి నిందితులకు సహకరించకండి

అధికారం, అంగబలం ఉందన్న అహాంకారంతో మ హిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా ఇ ష్టారాజ్యాంగా వ్యవహారించే వనమా రాఘవ లాంటి నిం దితులకు ఎవరూ సహాకరించకూడదని టీఆర్‌ఎస్‌ మాజీ రాష్ట్ర కార్యదర్శి చింతలపూడి వెంకట రెడ్డి అన్నారు. ఆ యన గురువారం ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. రా మకృష్ణ, అతడి కుటుంబ సభ్యుల మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి తగిన న్యాయం జరగా లంటే వనమా రాఘవతో పాటు మరో ఇదరు నింది తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఇలాంటి వ్యక్తులు సమాజంలో మరెందరో ఉన్నారని, వారిని కఠి నంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

కఠిన చర్యలు తీసుకోవాలి

దమ్మపేట, జనవరి 6: పాల్వంచ పట్టణానికి చెందిన రామకృష్ణ కుంటుంబాన్ని ఆత్మహత్యకు ప్రేరేపించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌ పార్టీ కో-కన్వీనర్‌ సోయం వీరభద్రం డిమాండ్‌ చేసారు. దమ్మపేట లో గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతు రామకృష్ణ కుంటంభం ఆత్మహత్య కు పాల్పడటం చాలాబాధాకరమని ఇలాంటి ఘటనలు మరోసారి పునారావృతం కాకుండా ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకోవాలన్నారు.సమావేశంలో శ్రీనివాసరావు, మాజీ ఎంపీటీసీ ఘంటా వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-07T05:29:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising