భద్రాద్రి ఎస్పీ సునీల్దత బదిలీ
ABN, First Publish Date - 2022-07-02T06:31:05+05:30
భద్రాద్రి ఎస్పీ సునీల్దత బదిలీ
డీజీపీ కార్యాలయానికి అటాచ్
కొత్త బాస్గా డాక్టర్ వినీత నియామకం
భద్రాచలం ఏఎస్పీగా రోహితరాజు
కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటర్, జూలై 1 : భద్రాద్రికొత్తగూడెం ఎస్పీ సునీల్దత బదిలీ అయ్యారు. ఆయన్ను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ చీఫ్ సెక్రటరీ సోమేశకుమార్ శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. సునీల్దత స్థానంలో కొత్తగూడెం ఓఎస్డీగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ వినీతను ఎస్పీగా నియమించారు. బదిలీ అయిన సునీల్దత 2018 సెప్టెంబరు 11న జిల్లా ఎస్పీగా బాధ్యతలుచేపట్టి మావోయిస్టు కార్యాకలాపాల నియంత్రణ, శాంతిభద్రతల నిర్వహణ సమర్థవంతంగా పనిచేశారన్న గుర్తింపు పొందారు. జిల్లాలో నాలుగేళ్ల పాటు పనిచేసిన ఆయన బదిలీపై వెళుతున్నారు. కొత్త ఎస్పీగా నియమితులైన డాక్టర్ వినీత విద్యాభ్యాసమంతా కర్నాటకలోనే జరిగింది. 2016లో బెంగళూరులో ఎంఎ్సఆర్థోపెడిక్ డాక్టర్గా విధుల్లో ఉన్న ఆయన 2017సివిల్స్ కర్నాటక బ్యాచ్కు ఎంపికయ్యారు. అదే సంవత్సరం భద్రాచలం ఏఎస్పీగా తొలి పోస్టింగ్ అందుకున్నారు. కొంతకాలం తర్వాత నిజామాబాద్ ఏసీపీగా వెళ్లి.. మళ్లీ కొత్తగూడెం ఓఎస్డీగా వచ్చి.. ప్రస్తుతం ఎస్పీగా నియమితులయ్యారు. ఇక భద్రాచలం ఏఎస్పీగా.. ప్రస్తుతం జిల్లా గ్రేహౌండ్స్ ఏఎస్పీగా విధులునిర్వహిస్తున్న బిరుదురాజు రోహితరాజును ప్రభుత్వం నియమించింది.
Updated Date - 2022-07-02T06:31:05+05:30 IST