అన్న చేతిలో తమ్ముడి హతం
ABN, First Publish Date - 2022-04-04T04:52:44+05:30
పాతకక్షలను దృష్టిలో పెట్టుకున్న అన్న.. తమ తండ్రి కర్మకాండల నిర్వహణ, ఖర్చుల గురించి చర్చించే సమయంలో తమ్ముడిపై కర్రతో దాడి చేసి హతమార్చిన సంఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కిష్టాపురంలో ఆదివారం జరిగింది.
పాతకక్షల నేపథ్యంలో దాడి
ఖమ్మం జిల్లా కిష్టాపురంలో ఘటన
కూసుమంచి, ఏప్రిల్ 3: పాతకక్షలను దృష్టిలో పెట్టుకున్న అన్న.. తమ తండ్రి కర్మకాండల నిర్వహణ, ఖర్చుల గురించి చర్చించే సమయంలో తమ్ముడిపై కర్రతో దాడి చేసి హతమార్చిన సంఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కిష్టాపురంలో ఆదివారం జరిగింది. కిష్టాపురానికి చెందిన జూలూరు రాములు, గోవింగ్ అన్నదమ్ములు. వారి తండ్రి ఇటీవల మృతిచెందగా ఈ నెల 7న కర్మకాండలు చేయాల్సి ఉంది. ఆ కార్యక్రమ నిర్వహణ, దానికి సంబంధించిన ఖర్చుల విషయమై వారు శనివారం సాయంత్రం చర్చించేందుకు కూర్చున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. అయితే అప్పటికే ఇద్దరి మధ్య పాతగొడవలు ఉండటంతో వాటిని మనసులో పెట్టుకున్న రాములు.. గోవింద్(45)ను కర్రతో వీపుపై, ఎదురురొమ్ముపై కొట్టి నెట్టివేయడంతో గోవింద్ పక్కనే ఉన్న బండరాయిపైపడ్డాడు. దీంతో అతడి తలకు బలమైనగాయాలవడంతో ఖమ్మం ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. గోవింద్కు భార్య, ఇద్దరు కుమారులున్నారు. అయితే కర్మకాండల విషయంలో మాట్లాడుతుండగా రాములు పాతకక్షలను దృష్టిలో పెట్టుకుని తన భర్తను కొట్టి హత్య చేశాడని గోవింద్ భార్య ఉపేంద్ర ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని కూసుమంచి ఎస్ఐ నందీప్ తెలిపారు.
Updated Date - 2022-04-04T04:52:44+05:30 IST