ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
ABN, First Publish Date - 2022-01-19T04:51:08+05:30
ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనపై మంగళవారం బూర్గంపాడు పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
బూర్గంపాడు, జనవరి 18: ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనపై మంగళవారం బూర్గంపాడు పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బూర్గంపాడు మండల పరిధిలోని మోరంపల్లిబంజర గ్రామపంచాయతీ పరిదిలోని డబుల్బెడ్ రూమ్ కాలనీకి చెందిన పద్దం లక్ష్మయ్య(37) మంగళవారం తన ఇంటిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య వాణిశ్రీ పనికి వెళ్లగా, మధ్యాహ్న సమీపంలో ఈ ఘటనకు పాల్పడ్డాడు. గమనించిన స్ధానిక కాలనీ వాసులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుడికి భార్య వాణిశ్రీ, ఇద్దరు కుమారులు ఉన్నారు.
Updated Date - 2022-01-19T04:51:08+05:30 IST