సాధిక్ అలీ సేవలు మరవలేనివి
ABN, First Publish Date - 2022-08-13T04:22:01+05:30
విద్యాభివృధ్దికి తోడ్పాటునందిస్తున్న సామాజికవాది సాధిక్అలీ సేవలు మరువలేనివని ఎమ్మె ల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు.
కల్లూరులో విద్యాభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్నారు
కొనియాడిన ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
తోపుడుబండి ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ
కల్లూరు, ఆగష్టు 12: విద్యాభివృధ్దికి తోడ్పాటునందిస్తున్న సామాజికవాది సాధిక్అలీ సేవలు మరువలేనివని ఎమ్మె ల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. కల్లూరులోని బాలికోన్నత పాఠశాలలో శక్రవారం తోపుడుబండి ఫౌండేష న్ ఆధ్వర్యంలో మండల స్థాయిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లోని పేద విద్యార్థులకు రూ.1.20 లక్షల విలువైన 100 సైకిళ్లను ఎమ్మెల్యే సండ్ర చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర ప్రసంగిస్తూ రెండేళ్ల నుంచి కల్లూరు మండలంలో సాధిక్అలీ తోపుడుబండి ఫౌండేషన్ తరుపున పలు సామాజిక కార్యక్రమాలు చేపట్టారని, కరోనా కష్ట కాలంలో కరోనా బాధితులకు అన్నదాన కార్యక్రమాలు, ఆన్లైన్ తరగతుల సమయంలో ఎంతో మంది విద్యార్థులకు మొబైల్ ఫోన్లు అందించారన్నారు. సాధిక్అలీ అందిస్తున్న సహకారాన్ని వినియోగిం చుకుని విద్యార్ధులు ఉన్నతంగా ఎదగాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా రక్షాబంధన్ను పురస్కారించుకుని సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే సండ్ర సమక్షంలో అంగన్వాడీ టీచర్లు రాఖీలు కట్టారు. కార్యక్రమంలో ఎంపీపీ బీరవల్లి రఘు, జడ్పీటీసీ కట్టా అజయ్కుమార్, రైతుబంధు ప్రతినిధులు డాక్టర్ లక్కినేని రఘు, పసుమర్తి చందర్రావు, డీసీసీబీ డైరెక్టర్ బోబోలు లక్ష్మణరావు, కో-ఆప్షన్ సభ్యులు ఇస్మాయిల్, కమ్లీ, ఏఎంసీ వైస్ చైర్మన్ వెంకటేశ్వరరావు, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు రామారావు, కొరకొప్పు ప్రసాద్, పెడకంటి రామకృష్ణ, కట్టా అర్లప్ప, రైతు సంఘం అధ్యక్షుడు జయబాబురెడ్డి పాల్గొన్నారు.
Updated Date - 2022-08-13T04:22:01+05:30 IST