11న రాజ్యసభ సభ్యులకు సన్మానం
ABN, First Publish Date - 2022-07-06T05:36:33+05:30
ఖమ్మం జిల్లాకు చెందిన హెటిరో డ్రగ్స్ అధినేత డాక్టర్ బండి పార్ధసారధిరెడ్డి, ప్రముఖ వ్యాపారి వద్దిరాజు రవిచంద్ర రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన సందర్భంగా ఈ నెల 11న సత్తుపల్లిలో వారిద్దరిని టీఆర్ఎస్ తరఫున ఘనంగా సన్మానించనున్నారు.
సత్తుపల్లి, జూలై 5: ఖమ్మం జిల్లాకు చెందిన హెటిరో డ్రగ్స్ అధినేత డాక్టర్ బండి పార్ధసారధిరెడ్డి, ప్రముఖ వ్యాపారి వద్దిరాజు రవిచంద్ర రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన సందర్భంగా ఈ నెల 11న సత్తుపల్లిలో వారిద్దరిని టీఆర్ఎస్ తరఫున ఘనంగా సన్మానించనున్నారు. వారిని రాజ్యసభకు ఎంపిక చేసి ముఖ్యమంత్రికి కృతజ్ఞత సభ నిర్వహించనున్నారు. ఈ మేరకు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో సభ ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. సన్మాన, కృతజ్ఞత సభ విజయవంతం చేసేందుకు మండల కమిటీల ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించి జన సమీకరణ చేయనున్నట్లు పార్టీ వర్గాలలు తెలిపాయి. 11న మధ్యాహ్నం మూడు గంటలకు స్థానిక వెంగళరావునగర్ నుంచి కార్యకర్తలు భారీ ఊరేగింపుగా ఇద్దరు రాజ్యభ సభ్యులను తీసికొని రానున్నారు. సత్తుపల్లి డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన సభాప్రాంగణంలో సన్మానం, సభ జరగనుంది.
Updated Date - 2022-07-06T05:36:33+05:30 IST