ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీ కార్యకర్త ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం: పొంగులేటి

ABN, First Publish Date - 2022-04-19T19:27:24+05:30

పోలీసుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న బీజేపీ కార్యకర్త సాయి గణేష్ కుటుంబాన్ని పొంగులేటి పరామర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖమ్మం: పోలీసుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న బీజేపీ మాజ్దూర్ యూనియన్ జిల్లా కన్వీనర్ సాయి గణేష్ కుటుంబాన్ని తమిళనాడు బీజేపీ ఇంచార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి పరామర్శించి.. లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ కార్యకర్త సాయి గణేష్ ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. పోలీస్ కేసులు, వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడాన్ని అందరూ ఖండిస్తున్నారన్నారు. 


ఖమ్మంలో ధర్మం, న్యాయం మాట్లాడితే కేసులు పెట్టి వేధిస్తున్నారని, సాయి గణేష్ చనిపోయే ముందు వీడియోలో జిల్లా మంత్రి, కార్పొరేటర్ వేధింపులతో చనిపోతున్నానని చెప్పినా.. వారిపై ఇప్పటి వరకు కేసులు నమోదు చేయలేదని పొంగులేటి మండిపడ్డారు. సాయి గణేష్  ఘటనపై సిట్టింగ్ జడ్జీతో కానీ సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పువ్వాడ అజయ్‌ను మంత్రి పదవి నుంచి భర్తరఫ్ చేయాలన్నారు. పోలీసులు ప్రజల పక్షాన పనిచేయాలన్నారు. ముఖ్యమంత్రికి చట్టంపై నమ్మకం ఉంటే మంత్రి పువ్వాడను బర్తరఫ్ చేయాలని పొంగులేటి డిమాండ్ చేశారు.

Updated Date - 2022-04-19T19:27:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising