భద్రాచలం, జమలాపురంలో పొంగులేటి పూజలు
ABN, First Publish Date - 2022-07-07T04:59:26+05:30
భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి వారిని ఖమ్మం మాజీఎంపీ, తెరాస నాయకులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి దంపతులు దర్శించుకున్నారు. ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
స్వామివార్లకు కుమార్తె స్వప్నిరెడ్డి పెళ్లికార్డు అందజేత
భద్రాచలం,జూలై6: భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి వారిని ఖమ్మం మాజీఎంపీ, తెరాస నాయకులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి దంపతులు దర్శించుకున్నారు. ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో శ్రీనివాసరెడ్డి కుమార్తె వివాహ శుభలేఖను భద్రాద్రి రామయ్య పాదాల చెంత ఉంచి పూజలు నిర్వహించారు. పొంగులేటి వెంట జడ్పీచైర్మన్ కోరం కనకయ్య, పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, దేవస్థానం ఈవో బి.శివాజీ ఉన్నారు.
జమలాపురం ఆలయంలో..
ఎర్రుపాలెం: మండలంలోని జమలాపురం వెంకటేశ్వరస్వామి ఆలయంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన కుమార్తె స్వప్నిరెడ్డి వివాహ తొలి శుభలేఖను స్వామిపాదాల దగ్గర ఉంచి పూజచేసి స్వామికి సమర్పించినట్టు ఆయన తెలిపారు. కుమారుడి వివాహ తొలి శుభలేఖను స్వామికే ఇచ్చినట్టు గుర్తుచేశారు. శుభలేఖతోపాటు సుమారు 500గ్రాముల వెండి కలశాన్ని స్వామికి సమర్పించారు. దేవస్థానం తరుపున ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల కృష్ణమోహన్శర్మ ఈ కానుకను స్వీకరించారు ఈకార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, మధిర, ఎర్రుపాలెం మండలాల టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Updated Date - 2022-07-07T04:59:26+05:30 IST