ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నీటి తొట్టిలో పడి చిన్నారి దుర్మరణం

ABN, First Publish Date - 2022-01-22T05:20:08+05:30

మండల పరిధిలోని పెంట్లంలో శుక్రవారం ఇంటి ఆవరణంలోని నీటితొట్టిలో పడి రీనామాధురి(4) అనే చిన్నారి మృతి చెందింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అన్నపురెడ్డిపల్లి, జనవరి 21: మండల పరిధిలోని పెంట్లంలో శుక్రవారం ఇంటి ఆవరణంలోని నీటితొట్టిలో పడి రీనామాధురి(4) అనే చిన్నారి మృతి చెందింది. కుటుంబ సభ్యులు తొలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మృతురాలు తండ్రి బన్నే మహేష్‌, భార్య శిరీషతో కలిసి ఆమె పుట్టింటి వద్దే ఉంటున్నారు. శిరీష దివ్యాం గురాలు కావటంతో  కూతురు రీనామాధురిని చూసుకుంటూ ఇంటివద్దే ఉంటుం డగా, మహేష్‌ అత్తామామతో కలిసి కూలిపనులకు పోతున్నాడు. పాఠశాలలకు సెలవులు కావటంతో మాధురి తోటి పిల్లతో కలిసి ఆడుకుంటోంది. కూతురు కనిపించకపోగా తోటి పిల్లలతో కలసి ఆడుకుంటుందిలే అని శిరీష భావించింది. దీనికి తోడు ఆమె నడవలేని కారణంగా కూతురు జాడ కోసం ప్రయత్నించలేదు. ఎంతకీ కూతురు కనిపించకపోవటంతో చుట్టుపక్కల ఉన్న కుటుంబ సభ్యులకు తెలిపింది. వారు చిన్నారిని వెతుకుతుండగా నీటితొట్టిలో శవమై కనిపించింది. చిన్నారి మృతితో కుటుంబ సభ్యుల రోదనలు ఆ ప్రాంతంలోని వారిని కలసివేశాయి.

Updated Date - 2022-01-22T05:20:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising