సాదాసీదాగా సర్వసభ్య సమావేశం
ABN, First Publish Date - 2022-12-23T23:23:58+05:30
ఏజెన్సీ గ్రామాల్లోని సమస్యలపై మండల అధికారులకు చిత్తశుద్ధి లేదని, అధికారుల నిర్లక్ష్యం మూలంగా సమస్యలు తిష్టవేయడంతో ప్రజాప్రతినిధులు గ్రామాల్లోకి వెళితే సమస్యలతో స్వాగతం పలుకుతున్నాయని మండల ప్రజాప్రతినిధులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
గుండాల, డిసెంబరు 23: ఏజెన్సీ గ్రామాల్లోని సమస్యలపై మండల అధికారులకు చిత్తశుద్ధి లేదని, అధికారుల నిర్లక్ష్యం మూలంగా సమస్యలు తిష్టవేయడంతో ప్రజాప్రతినిధులు గ్రామాల్లోకి వెళితే సమస్యలతో స్వాగతం పలుకుతున్నాయని మండల ప్రజాప్రతినిధులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో కనిపించని అధికారులకు కనీసం సమావేశాల్లో అయినా సమస్యలు చెబుదామంటే సమావేశాలకు సైతం హాజరు కావడంలేదని వారిపై చర్యలు తీసుకోవాలని ఏకగ్రీవ తీర్మాణం చేశారు. మండల ప్రజాపరిషత్ కార్యా లయంలో ఎంపీపీ ముక్తి సత్యం అధ్యక్షతన శుక్రవారం సాధారణ సర్వసభ్య స మావేశం జరింగింది. ముందుగా ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన గుండాల ఎంపీటీసీ ఎస్కే సంధాని మృతి పట్ల మౌనం పాటించి నివాళులు అ ర్పించారు. అనంతరం వివిద శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు మండ లంలో జరిగిన, జరుగుతున్న అభివృద్దిపై సమిక్ష నిర్వహించారు. ఈ సమా వేశంలో తహసీల్దార్ నాగదివ్య, ఎంపీడీవో ఎస్.వీ సత్యనారాయణ, ఎంపీఓ హజ్రత్ వలీ, ఎంపీటీసీ కల్తి క్రిష్ణారావు, సర్పంచ్లు, అధికారులు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-23T23:24:01+05:30 IST