ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

ABN, First Publish Date - 2022-10-03T04:53:35+05:30

మండల పరిధిలోని నాగారం కాలనీ వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాల్వంచ, అక్టోబరు 2: మండల పరిధిలోని నాగారం కాలనీ వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. ఆమె కూతురు గాయలతో బయట పడింది. పోలీసుల కథనం ప్రకారం పాల్వంచ బోల్లోరిగూడేనికి చెందిన పడాల అన్నపూర్ణ (40) పా ల్వంచ మునిసిపల్‌ కార్యాలయంలో అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి. చుట్టాల ఇంటికి తన కూతురు పింకీతో వెళ్లిన ఆమె పని ముగించుకుని రాత్రి సమయంలో తన స్కూటీపై పాల్వంచకు తిరుగు ప్రయాణమయ్యింది. నాగారం కాలనీ వద్దకు రాగానే అకస్మాత్తుగా వరాహం అడ్డు రావడంతో దానిని తప్పించబోతూ వాహనం అదుపు తప్పి ఇద్దరూ రోడ్డుపై పడ్డారు. ఈఘటనలో అన్నపూర్ణ తలకు తీవ్ర గాయాలై రక్తస్రావం ఏర్పడింది. స్థానికులు గమనించి హుటాహుటిన వారిని పాల్వంచ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి ప్రమాదకరంగా ఉండటంతో ఖమ్మం తరలిస్తుండగా మార్గమద్యంలో అన్నపూర్ణ మృతిచెందింది. ఆమె కూతురు పింకీకి స్వల్ప గాయాలయ్యాయి. మృతురాలి తండ్రి భాస్కర్ల వెంకన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్‌ ఎస్‌ఐ శ్రీనివాస్‌ తెలిపారు.

Updated Date - 2022-10-03T04:53:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising