యశోద ఆసుప్రతిలో కేసీఆర్ సతీమణి శోభ.. కాసేపట్లో ఆసుపత్రికి కేసీఆర్
ABN, First Publish Date - 2022-06-20T22:00:09+05:30
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు సతీమణి శోభ అనారోగ్య కారణాలతో యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు సతీమణి శోభ అనారోగ్య కారణాలతో యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గత కొన్ని రోజులుగా ఆమె మోకాలి నొప్పితో బాధపడుతున్నారు. ఈ నొప్పి తీవ్రం కావడంతో ఆదివారం సాయంత్రం సోమాజిగూడ యశోద హాస్పిటల్లో కుటుంబసభ్యులు చేర్చారు. నొప్పి తీవ్రంగా ఉండడంతో ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు. సీఎం కుటుంబసభ్యుల అంగీకారంతో శోభకు యశోద ఆస్పత్రి డాక్టర్లు మోకాలి ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం శోభ స్వల్ప అస్వస్థతతో ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. శోభను పరామర్శించేందుకు కాసేపట్లో కేసీఆర్ యశోద ఆసుపత్రికి వెళ్తారని ప్రగతి భవన్ వర్గాలు ప్రకటించాయి.
Updated Date - 2022-06-20T22:00:09+05:30 IST