ఎర్రవల్లిలోనే కేసీఆర్ సంక్రాంతి సంబరాలు
ABN, First Publish Date - 2022-01-15T00:31:14+05:30
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలోనే సంక్రాంతి పండుగను జరుపుకొనున్నట్లు తెలిసింది.
జగదేవపూర్: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలోనే సంక్రాంతి పండుగను జరుపుకొనున్నట్లు తెలిసింది. కొన్ని రోజులుగా జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టిన సీఎం కేసీఆర్ వివిధ పార్టీల నేతలతో సమావేశలతో బిజీ బిజీగా ఉన్నారు. ఈనెల 11న మంగళవారం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి వచ్చిన సీఎం మూడు రోజులుగా ఇక్కడే ఉన్నారు. శనివారం కూడా ఇక్కడే ఉండనున్నట్లు తెలిసింది. వ్యవసాయ క్షేత్రంలోనే కుటుంబ సమేతంగా పండుగను జరుపుకొనున్నట్లు తెలిసింది.
Updated Date - 2022-01-15T00:31:14+05:30 IST