ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

త్వరలో సీఎంతో కలిసి యాదాద్రికి వస్తా!

ABN, First Publish Date - 2022-02-23T08:22:12+05:30

ఆలయ ఉద్ఘాటనకు ముందే సీఎం కేసీఆర్‌తో కలిసి చినజీయర్‌ స్వామి యాదాద్రి క్షేత్రాన్ని సందర్శించనున్నారా?

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆలయ అర్చక బృందంతో చెప్పిన చినజీయర్‌?

యాదాద్రి, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): ఆలయ ఉద్ఘాటనకు ముందే సీఎం కేసీఆర్‌తో కలిసి చినజీయర్‌ స్వామి యాదాద్రి క్షేత్రాన్ని సందర్శించనున్నారా? అంకురారోపణకు ముందుగానే ముఖ్యమంత్రితో కలిసి యాదాద్రికి రానున్నారా? అంటే సంబంధిత వర్గాలు అవుననే అంటున్నాయి. లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ఉద్ఘాటన నేపథ్యంలో అంకురారోపణకు ముందుగానే సీఎం కేసీఆర్‌తో కలిసి యాదాద్రి క్షేత్రాన్ని సందర్శిస్తానని చినజీయర్‌స్వామి ఆలయ అర్చక బృందానికి చెప్పినట్లు తెలిసింది. మార్చి 21 నుంచి 28 వరకు నిర్వహించనున్న మహాకుంభ సంప్రోక్షణ వైదిక పర్వాల నిర్వహణపై దేవస్థాన అర్చక బృందం ముచ్చింతల్‌లోని ఆశ్రమంలో మంగళవారం చినజీయర్‌ను కలిసి సలహాలు, సూచనలు తీసుకున్నట్లు సమాచారం. మహాకుంభ సంప్రోక్షణకు మార్చి 21న అంకురారోపణ చేయాల్సి ఉండగా, ముందుగానే సీఎంతో కలిసి అక్కడికి వస్తానని, ఉద్ఘాటన మహోత్సవ ఏర్పాట్లను కూడా పర్యవేక్షిస్తానని చినజీయర్‌ చెప్పినట్లు తెలుస్తోంది.   

Updated Date - 2022-02-23T08:22:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising