కేసీఆర్ను గద్దె దించే సమయం వచ్చింది: బండి సంజయ్
ABN, First Publish Date - 2022-04-16T01:30:32+05:30
సీఎం కేసీఆర్ను గద్దె దించే సమయం వచ్చిందదని బీజేపీ నేత బండి సంజయ్ చెప్పారు. ప్రజాసంగ్రామ యాత్ర రెండో దశను జోగుళాంబ
గద్వాల: సీఎం కేసీఆర్ను గద్దె దించే సమయం వచ్చిందదని బీజేపీ నేత బండి సంజయ్ చెప్పారు. ప్రజాసంగ్రామ యాత్ర రెండో దశను జోగుళాంబ ఆలయం నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సంజయ్ మాట్లాడుతూ కేసీఆర్ డబ్బులిచ్చి ఇతర రాష్ట్రాలకు తిరుగుతున్నారని విమర్శించారు. ఉద్యోగాలకు ఎదురుచూసి నిరుద్యోగుల ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. కేసీఆర్ నిరుద్యోగులను ఆదుకోవాలన్నారు. ఢిల్లీలో కేసీఆర్ దొంగ దీక్ష చేశారని తప్పుబట్టారు. తెలంగాణ సాధించుకున్నది కేసీఆర్ కుటుంబం రాజ్యం ఏలడానికా? అని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబాన్ని ప్రశ్నిస్తే.. జైలుకు పంపుతున్నారని బండి సంజయ్ దుయ్యబట్టారు.
Updated Date - 2022-04-16T01:30:32+05:30 IST