బహుజన రాజ్యం స్థాపిస్తాం
ABN, First Publish Date - 2022-01-28T05:28:12+05:30
రాష్ట్రంలో కొనసాగుతున్న గడీల, అవినీతి పాలనను అంతమొందించి బహుజన రాజ్యం స్థాపిస్తామని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు.
- అవినీతి లేని ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యం
- బీఎస్సీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
సుభాష్నగర్, జనవరి 27: రాష్ట్రంలో కొనసాగుతున్న గడీల, అవినీతి పాలనను అంతమొందించి బహుజన రాజ్యం స్థాపిస్తామని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. గురువారం నగరంలోని గాంధీ చౌరస్తాలో ఏర్పాటు చేసిన బీఎస్పీ జెండాను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో బహుజనవాదం ఎంత బలంగా ఉందో జెండా కార్యక్రమానికి వచ్చిన వారిని చూస్తే తెలుస్తుందన్నారు. దుర్మార్గమైన పాలనను అంత మొందించి ప్రజాస్వామ్యబద్ధంగా బహుజన రాజ్యం స్థాపించి ఏనుగుమీద ప్రగతి భవన్కు వెళ్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలతో పాటు అగ్రవర్ణ పేదలందరికీ న్యాయం చేసేంత వరకు బహుజన సమాజ్ పార్టీ నిద్రపోదన్నారు. అవినీతి లేని ప్రభుత్వాన్ని స్థాపించడమే బహుజన్ సమాజ్ పార్టీ లక్ష్యమన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నిషాని రాంచంద్రం, కొంకటి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-01-28T05:28:12+05:30 IST