ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజన్నక్షేత్రానికి భక్తుల తాకిడి

ABN, First Publish Date - 2022-06-28T06:48:35+05:30

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం సోమవారం భక్తులతో కిటకిటలాడింది. ఆపదమొక్కులవాడు రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వేములవాడకు తరలివచ్చారు.

స్వామివారి దర్శనం కోసం బారులుదీరిన భక్తులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేములవాడ, జూన్‌ 27 : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ  రాజరాజేశ్వర క్షేత్రం సోమవారం భక్తులతో కిటకిటలాడింది. ఆపదమొక్కులవాడు  రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వేములవాడకు తరలివచ్చారు.  తమ ఇష్టదైవమైన  స్వామివారిని దర్శించుకొని తరించారు.  స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కును చెల్లించుకున్నారు. సోమవారం సందర్భంగా గర్భాలయ ప్రవేశం నిలిపివేసి లఘుదర్శనం అమలు చేశారు. భక్తులను నందీశ్వరుడి విగ్రహం వద్ద వరకే అనుమతించారు. ఆలయ కళాభవన్‌లో స్వామివారి నిత్యకల్యాణం, సత్యనారాయణవ్రతం తదితర ఆర్జిత సేవల్లో భక్తులు పాల్గొన్నారు. ఆలయ కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించారు. ఆలయ ఆవరణలో  స్వామివారికి నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించారు.  ఆషాఢమాసం ప్రారంభానికి ముందు చివరి సోమవారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.    భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో ఎల్‌.రమాదేవి నేతృత్వంలో అధికారులు ఏర్పాట్లు చేశారు

Updated Date - 2022-06-28T06:48:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising