అంటరానితనం అమానుషం
ABN, First Publish Date - 2022-07-01T06:20:32+05:30
అంటరానితనం అమానుషమని డిప్యూటీ తహసీ ల్దార్ రాముడు అన్నారు.
ఎలిగేడు, జూన్ 30: అంటరానితనం అమానుషమని డిప్యూటీ తహసీ ల్దార్ రాముడు అన్నారు. గురువారం ఎలిగేడు మండలంలోని బురహన్ మియాపేట్ గ్రామంలో పౌరహక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాల్గొన్న గ్రామస్థులను ఉద్ధేశించి వారు మాట్లాడారు. గ్రామం లో మౌలిక వసతుల కల్పనపై అధికారుల బృందం ఆరా తీసింది. రెండు గ్లాసుల సిద్ధాంతాలకు చరమగీతం పాడాలని సూచించారు. ప్రభుత్వ పథ కాలను సద్వినియోగం చేసుకొని అభివృద్ధి బాటలో పయనించాలని కోరారు. ఈకార్యక్రమంలో సర్పంచ్ ఆర్కె రాజా, ఆర్ఐ-2రజిత, దళిత సంఘాల నాయకులు, మహిళలు పాల్గొన్నారు.
Updated Date - 2022-07-01T06:20:32+05:30 IST