లక్ష్య సాధన కోసం నిరుద్యోగులు కృషి చేయాలి
ABN, First Publish Date - 2022-05-19T06:05:38+05:30
లక్ష్య సాధన కోసం నిరుద్యోగులు కృషి చేయాలని ఎమ్మెల్సీ కూర రఘోత్తం రెడ్డి అన్నారు.
- ఎమ్మెల్సీ కూర రఘోత్తం రెడ్డి
ధర్మపురి, మే 18: లక్ష్య సాధన కోసం నిరుద్యోగులు కృషి చేయాలని ఎమ్మెల్సీ కూర రఘోత్తం రెడ్డి అన్నారు. ధర్మపురి పట్టణంలోని ఉర్దూ ఘర్కం షాదీఖానా, టీటీడీ కల్యాణ మండపంలో ధర్మపురి ఈ- క్లాస్ రూమ్ పేరుతో ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ, ఎల్ఎం కొప్పుల సోషల్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఎస్ఐ, పోలీస్ కాన్స్టేబుల్, గ్రూప్ 1,2,3,4 పరీక్షల కోసం నిరుద్యోగ యువతీ, యువకులకు ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణా కేంద్రాలను బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా శిక్షణా తరగతులకు హాజరైన నిరుద్యోగ యువతీ యువకులతో ఆయన మాట్లాడారు. శిక్షణ పొందుతున్న తీరు, మౌలిక సదుపాయాలు గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ నిరుద్యోగ యువతీ యువకులు క్రమశిక్షణ, పట్టుదలతో గ్రూపు పరీక్షల కోసం చదివి ప్రతిభ కనభరచి ఉద్యోగాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఎమ్మెల్సీగా తన వంతు పూర్తి సహకారం అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ధర్మపురి మున్సిపల్ చైర్పర్సన్ సంగి సత్యమ్మ, పీఆర్టీయు జగిత్యాల జిల్లా అధ్యక్షులు యాళ్ల అమర్నాథ్రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఆనందరావు, మండల అధ్యక్షులు కస్తూరి వేణుగోపాల్, కేరళ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరస్పాండెంట్ చిలువేరి శ్యాంసుందర్, అవునూరి శ్రీకాంత్ పాల్గొన్నారు.
Updated Date - 2022-05-19T06:05:38+05:30 IST