బీజేపీ శ్రేణుల కదనోత్సాహం
ABN, First Publish Date - 2022-07-04T06:09:53+05:30
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, విజయసంకల్ప సభ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపాయి.
- సంకల్ప సభకు తరలిన నాయకులు
సిరిసిల్ల జూలై 3 (ఆంధ్రజ్యోతి): బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, విజయసంకల్ప సభ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపాయి. ఆదివారం సికింద్రాబాద్ పరేడ్ రగ్రౌండ్లో నిర్వహించిన ప్రధాని నరేంద్రమోదీ విజయ సంకల్ప సభకు జిల్లా నుంచి భారీ సంఖ్యలో బీజేపీ నాయకులు తరలివెళ్లారు. వర్షం పడుతున్నా ఉత్సాహంగా వాహనాల్లో బయల్దేరారు. సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలతోపాటు తంగళ్లపల్లి, ముస్తాబాద్, గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, ఇల్లంతకుంట, చందుర్తి, బోయినపల్లి, కోనరావుపేట, రుద్రంగి వేములవాడ, వేములవాడ రూరల్ మండలాల్లోని బూత్ కమిటీల నుంచి జిల్లా కమిటీల వరకు బీజేపీ నాయకులు ఉన్నారు.
Updated Date - 2022-07-04T06:09:53+05:30 IST