నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యం
ABN, First Publish Date - 2022-05-20T05:53:59+05:30
జగిత్యాల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నా రు.
ఎమ్మెల్యే సంజయ్ కుమార్
జగిత్యాల టౌన్, మే 19 : జగిత్యాల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నా రు. జగిత్యాల పట్టణంలోని పలు వార్డుల్లో లబ్ధిదారులకు మంజూరైన క ల్యాణ లక్ష్మి, షాధీ ముబారక్, సీఎం సహాయ నిధి చెక్కులను ఇంటింటికీ వెళ్లి అందజేశారు. బీట్ బజార్లో రూ. 4 కోట్లతో నిర్మిస్తున్న సమీకృత మా ర్కేట్ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. పార్టీ కార్యాలయంలో జగిత్యాల రూరల్ మండలానికి చెందిన 58 మంది లబ్ధిదారులకు మంజూరైన సీఎం సహాయ నిధి చెక్కులను జడ్పీ చైర్పర్సన్ దావ వసంతో, బల్దియా చైర్ పర్సన్ బోగ శ్రావణితో కలిసి పంపిణీ చేసి మాట్లాడారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో అతి పురాతన జగిత్యాల పట్టణాన్ని అన్ని వ సతులతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభు త్వం పెద్ద పీట వేస్తుందన్నారు. అనంతరం దావ వసంత, బల్దియా చైర్ పర్సన్ బోగ శ్రావణిలు మాట్లాడుతూ ఆపదలో ఉన్న పేదలకు సీఎం సహా య నిధి వరం లింటిదని వివరించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గోళి శ్రీనివాస్, ఇంచార్జి ఎంపీపీ రాజేంద్ర ప్రసాద్, పీఏసీఎస్ చైర్మన్ మహిపాల్ రెడ్డి, రైతుబంధు కన్వీనర్ రవీందర్రెడ్డితో పాటు అన్ని గ్రామాల సర్పం చులు, ఎంపీటీసీలు, పట్టణ నాయకులు, కౌన్సిలర్లు ఉన్నారు.
Updated Date - 2022-05-20T05:53:59+05:30 IST