ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆలయ ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచాలి

ABN, First Publish Date - 2022-07-02T06:26:45+05:30

: రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానం ప్రాంగణమంతా పరిశుభ్రంగా ఉంచాలని, ఆలయ పరిసరాలు, గుడి చెరవు ప్రాంగణం, ఓపెన్‌ స్లాబ్‌ ప్రాంతంలో దోమలు వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ సత్యప్రసాద్‌ ఆదేశించారు.

గుడి చెరువు ప్రాంగణం పరిశీలిస్తున్న అదనపు కలెక్టర్‌ సత్యప్రసాద్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

-  అదనపు కలెక్టర్‌ సత్యప్రసాద్‌

వేములవాడ, జూలై 1 : రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానం ప్రాంగణమంతా పరిశుభ్రంగా ఉంచాలని, ఆలయ పరిసరాలు, గుడి చెరవు ప్రాంగణం, ఓపెన్‌ స్లాబ్‌ ప్రాంతంలో దోమలు వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలని  స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ సత్యప్రసాద్‌ ఆదేశించారు. శుక్రవారం  రాజన్న ఆలయం, గుడి చెరువు పరిసరాలను పరిశీలించారు.   స్వామివారి నిత్యకల్యాణం నిర్వహించే కళాభవన్‌, ఓపెన్‌ స్లాబ్‌ ప్రాంగణం కింద భారీ ఎత్తున మురుగు నీరు నిల్వ ఉండడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వర్షాకాలం ప్రారంభమైనందున ఎక్కడా నీటి నిల్వ ఉండకుండా చూడాలని, దోమలు వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు ఆలయ సిబ్బంది దోమల నివారణ మందును చల్లారు. ఆయన వెంట ఆలయ ఈవో రమాదేవి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రామతీర్థపు మాధవి, కమిషనర్‌ శ్యాంసుందర్‌రావు, ఆలయ ఏఈవో జయకుమారి, డీఈ రఘునందన్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-07-02T06:26:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising