ఎస్ఐ, కానిస్టేబుల్ శారీరక సామర్థ్య పరీక్షలు
ABN, First Publish Date - 2022-12-10T00:13:21+05:30
ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం అభ్య ర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా కరీంనగర్లోని సీటీసీలో రెండో రోజు శుక్రవారం నిర్వహించిన శారీరక సామర్థ్య పరీక్షల్లో 304 మంది అర్హత సాధించారు.
కరీంనగర్ క్రైం, డిసెంబరు 9: ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం అభ్య ర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా కరీంనగర్లోని సీటీసీలో రెండో రోజు శుక్రవారం నిర్వహించిన శారీరక సామర్థ్య పరీక్షల్లో 304 మంది అర్హత సాధించారు. కరీంనగర్ పోలీ స్ కమిషనర్ వి సత్యనారాయణ పర్యవేక్షణలో ఈ పరీక్షలు కొన సాగాయి. ఉదయం 6 గంటలకు దేహదారుఢ్య పరీక్షలలో భాగంగా మొదట 1,600 మీటర్ల దూరం పరుగు పందెం, అనంతరం కొలత లు, ఈవెంట్లను నిర్వహించారు. రెండో రోజు శుక్రవారం 801 మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా 605 మంది హాజరయ్యారు. 94 మంది గైర్హాజరుకాగా మరో 102 మంది అనారోగ్యం కారణంగా హాజ రు కాలేకపోతున్నట్లు ధ్రువ పత్రా లు చూపించటంతో వారికి తరువా త తేదీలలో పాల్గొనేందుకు అనుమ తించారు. ఈ శారీరకసామర్థ్య పరీక్షల్లో 301 మంది అర్హత సాధించేలక పోయారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ జి చంద్రమోహన్, ఏసీపీలు విజయసారధి, ప్రతాప్, మదన్లాల్, సత్య నారాయణ, ఎస్బీఐ జి వెంకటేశ్వర్లు, అడ్మినిస్ట్రేటివ్ అధికారి మునిరత్నం, మినీస్టీరియల్ విభాగం అధికారులు, సిబ్బంది, ఆర్ఐలు జానిమియా, కిరణ్ కుమార్, మురళి, మల్లేశం, పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-10T00:13:24+05:30 IST