ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పారిశుధ్య పనులు వేగవంతం చేయాలి

ABN, First Publish Date - 2022-07-20T05:46:56+05:30

మండంల లోని అన్ని గ్రామాలలో పారిశుధ్య పనులు వేగవంతం చేయాలని స్థానిక సంస్థల అడిషనల్‌ కలెక్టర్‌ అరుణ శ్రీ సంబంధిత అధికారులను ఆదేశించారు.

కోటిలింగాలలో పరిశీలిస్తున్న అడిషనల్‌ కలెక్టర్‌ అరుణ శ్రీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- అడిషనల్‌ కలెక్టర్‌ అరుణ శ్రీ

వెల్గటూర్‌ , జులై 19: మండంల లోని అన్ని గ్రామాలలో పారిశుధ్య పనులు వేగవంతం చేయాలని స్థానిక సంస్థల అడిషనల్‌ కలెక్టర్‌ అరుణ శ్రీ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం మండలం లోని కోటిలింగాల, ముత్తునూర్‌, ముక్కట్రావ్‌పేట, రాంనూర్‌ గ్రామాలలో అడి షనల్‌ కలెక్టర్‌ ఆకస్మికంగా పర్యటించారు. ఆయా గ్రామాలలో పారిశుధ్య పనులు, అవెన్యూ ప్లాంటేషన్‌ను పర్యవేక్షించారు. భారీ వర్షాల కారణంగా గ్రామాలలో వరదల కారణంగా అపరిశుభ్రత ఏర్పడిందని యుద్ద ప్రాతిప దికన పారిశుధ్య పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యం గా గోదావరి తీర ప్రాంత గ్రామాలలో వరదల కారణంగా అపరిశుభ్రత అధికంగా ఉందని వెంటనే పరిశుభ్రతా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయితీ అఽధికారి హరికిషన్‌, డీఎల్‌పీవో కనకదు ర్గ, ఎంపీడీవో సంజీవ్‌రావు, ఎంపీవో శ్రీనివాస్‌, ఏపీవో అనిల్‌, నక్క రవి తేజ, యాగండ్ల తిరుపతి, అనుమాల తిరుపతి పాల్గొన్నారు.


Updated Date - 2022-07-20T05:46:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising