రాజన్న హుండీ ఆదాయం రూ.2.25 కోట్లు
ABN, First Publish Date - 2022-05-27T05:56:50+05:30
ములవాడ రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానం ఖజానాకు హుండీ ద్వారా రూ. 2.25 కోట్ల పైచిలుకు ఆదాయం లభించింది.
వేములవాడ, మే 26 : వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానం ఖజానాకు హుండీ ద్వారా రూ. 2.25 కోట్ల పైచిలుకు ఆదాయం లభించింది. 28 రోజుల వ్యవధిలో భక్తులు హుండీలో సమర్పించిన నగదు, బంగారం, వెండి కానుకలను ఆలయ ఓపెన్ స్లాబ్ ప్రాంగణంలో గురువారం లెక్కించారు. ఈ సందర్భంగగా 2 కోట్ల 25 లక్షల 8 వేల 914 రూపాయల నగదు, 366 గ్రాముల 500 మిల్లీ గ్రాముల బంగారం, 18 కిలోల 650 గ్రాముల వెండి సమకూరింది. ఆలయ ఈవో ఎల్.రమాదేవి హుండీ లెక్కింపును పర్యవేక్షించారు.
Updated Date - 2022-05-27T05:56:50+05:30 IST