డిగ్రీ కళాశాలను పరిశీలించిన మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్
ABN, First Publish Date - 2022-01-21T06:47:37+05:30
ఈ విద్యాసంవత్సరం ప్రారంభంకానున్న మెడికల్ కళాశాల బోధన తరగతుల భవనం కోసం గురువారం రామగుండం మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ హిమబిందు డిగ్రీ కళాశాల భవనాలను పరిశీలించారు.
కళ్యాణ్నగర్, జనవరి 20: ఈ విద్యాసంవత్సరం ప్రారంభంకానున్న మెడికల్ కళాశాల బోధన తరగతుల భవనం కోసం గురువారం రామగుండం మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ హిమబిందు డిగ్రీ కళాశాల భవనాలను పరిశీలించారు. కళాశాల మైదానంలో నూతనంగా నిర్మాణమవుతున్న మెడికల్ కళాశాల భవనాన్ని పరిశీలించారు. తాత్కాలికంగా తరగతులను బోధించేందుకు డిగ్రీ కళాశాలలోని గదులను పరిశీలించారు. తరగతులకు అనువుగా ఉండే విధంగా తీసుకోవాల్సిన చర్యలపై ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లతో చర్చించారు. అనంతరం కళాశాలలో మౌలిక వసతుల ఏర్పాట్లపై కలెక్టర్ సంగీతసత్యనారాయణకు నివేదిక ఇచ్చారు. అదే విధంగా గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి కావాల్సిన వసతులు, కావాల్సిన పరికరాలపై కలెక్టర్కు నివేదిక ఇచ్చారు. ప్రిన్సిపాల్ ప్రొఫెసర్లు నరేందర్, రత్నేష్, అనంతబాబు, రాజు ఉన్నారు.
Updated Date - 2022-01-21T06:47:37+05:30 IST