ప్రజలకు మెరుగైన సేవలందించాలి
ABN, First Publish Date - 2022-08-19T05:34:58+05:30
క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన సేవలందించాలని పెద్దపల్లి డీసీపీ రూపేష్ పోలీసులకు సూచించారు.
- పెద్దపల్లి డీసీపీ రూపేష్
సుల్తానాబాద్, ఆగస్టు 18: క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన సేవలందించాలని పెద్దపల్లి డీసీపీ రూపేష్ పోలీసులకు సూచించారు. డీసీపీగా బాధ్యతలు స్వీకరించి అనంతరం మొదటిసారి ఆయన గురువారం సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ను సందర్శించారు. గతంలో ఆయన ఇక్కడ ట్రైనీ ఐపీఎస్ అధికారిగా పనిచేసినపుడు శాస్త్రినగర్లోని పోలీస్ శాఖ స్థలాన్ని పరిరక్షించారు. చుట్టూ కంచె వేయించి అందులో మొక్కలు నాటించారు. గురువారం ఆయన పోలీస్ శాఖ స్థలా న్ని కూడా చూశారు. అందులో పెరుగుతున్న మొక్కలను చూసి సంతోషం వ్యక్తం చేశారు. తన హయాంలో నాటిన మొక్కలను సంరక్షించిన ఎస్ఐ ఉపేందర్ తదితర పోలీస్ అధికారులను ఆయన అభినందించారు. కాగా పోలీస్ స్టేషన్ సందర్శనలో భాగంగా సిబ్బంది పనితీరు, నమోదయ్యే కేసుల వివరాల తీరును అడిగి తెలుసుకు న్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో సీసీ కెమెరాల పనితీరు నేరాల నియంత్రణకు తీసు కుంటున్న చర్యలను కూడా తెలుసుకున్నారు. నేరాల నియంత్రణకు సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఏసీపీ సారంగ పాణి, సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్ఐలు ఉపేందర్ అశోక్రెడ్డి, వినీత ఉన్నారు.
Updated Date - 2022-08-19T05:34:58+05:30 IST