ఆరోగ్య జిల్లాగా తీర్చిదిద్దడానికి మంత్రి కేటీఆర్ కృషి
ABN, First Publish Date - 2022-12-31T00:13:54+05:30
సిరిసిల్లను ఆరోగ్య జిల్లాగా తీర్చిదిద్దడానికి మంత్రి కేటీఆర్ అహర్నిషలు కృషి చేస్తున్నారని జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణరాఘవరెడ్డి అన్నారు.
- జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణరాఘవరెడ్డి
సిరిసిల్ల టౌన్, డిసెంబరు 30 : సిరిసిల్లను ఆరోగ్య జిల్లాగా తీర్చిదిద్దడానికి మంత్రి కేటీఆర్ అహర్నిషలు కృషి చేస్తున్నారని జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణరాఘవరెడ్డి అన్నారు. శుక్రవారం సిరిసిల్ల పట్టణంలోని జిల్లా ప్రధాన ఆస్పత్రిని తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని పలు వార్డులు పరిశీలించారు. అనంతరం ఆస్పత్రి వైద్యులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్ పర్సన్ వూట్లాడుతూ కరోనా మరోసారి విజృంభించే అవకాశం ఉందని, వైద్యులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఆస్పత్రిలో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఇతర వ్యాధుల చికిత్సకు మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. సమావేశంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మురళీధర్రావు, ఆర్ఎంవో నాగరాజు, వైద్యులు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-31T00:14:01+05:30 IST