మహాగౌరీ అలంకారంలో అమ్మవారి దర్శనం
ABN, First Publish Date - 2022-10-04T06:24:47+05:30
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి దివ్యక్షేత్రంలో శ్రీరాజరాజేశ్వరి అమ్మవారు సోమవారం మహాగౌరీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
వేములవాడ, అక్టోబరు 3: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి దివ్యక్షేత్రంలో శ్రీరాజరాజేశ్వరి అమ్మవారు సోమవారం మహాగౌరీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీరాజరాజేశ్వరస్వామివారి దేవస్థానంలో నిర్వహిస్తున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఎనిమిదవ రోజు ఉదయం అమ్మవారికి వివిధ పూజలు నిర్వహించారు. రాత్రి 8 గంటలకు శ్రీమహిషాసుర మర్ధిని అమ్మవారికి అర్చకులు మహాపూజ నిర్వహించారు.
Updated Date - 2022-10-04T06:24:47+05:30 IST