ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలి

ABN, First Publish Date - 2022-08-29T05:22:14+05:30

గంభీరావుపేట మండలం మల్లుపల్లె కమాన్‌ వద్ద రోడ్డుపై దమ్మన్నపేట వాసులు ఆదివారం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఇదే స్థలంలో శనివారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దమ్మన్నపేట వాసి ఆవునూరి గంగయ్య కుటుంబానికి న్యాయం చేయాలని బైఠాయించారు.

ఆందోళన చేస్తున్న దమ్మన్నపేట గ్రామస్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- దమ్మన్నపేట వాసుల ఆందోళన 

గంభీరావుపేట, ఆగస్ట్‌ 28 : గంభీరావుపేట మండలం మల్లుపల్లె కమాన్‌ వద్ద రోడ్డుపై దమ్మన్నపేట వాసులు ఆదివారం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఇదే స్థలంలో శనివారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దమ్మన్నపేట వాసి  ఆవునూరి గంగయ్య కుటుంబానికి న్యాయం చేయాలని బైఠాయించారు.  అతి వేగంతో కారు ఢీకొట్టడంతోనే  గంగయ్య మృతి చెందాడని, ఈ సంఘటనపై పోలీస్‌లు స్పందించి రోడ్డు ప్రమాదానికి కారకుడైన వ్యక్తిని తక్షణమే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కామారెడ్డి, సిరిసిల్ల ప్రధాన రహదారిపై పెద్ద ఎత్తున దమ్మన్నపేట గ్రామస్థులు బైఠాయించారు.గంటల తరబడి ఆందోళన జరగడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిచిలి పోయాయి. ఎల్లారెడ్డిపేట సీఐ మొగిలి, గంభీరావుపేట ఎస్సై మహేష్‌ ఆందోళన వద్దకు చేరి సముదాయించారు. మృతుడి కుటుంబానికి న్యాయంతోపాటు రోడ్డు ప్రమాదానికి బాధ్యుడైన వ్యక్తిని వెంటనే అదుపులోకి తీసుకునే వరకు ఆందోళన కొనసాగుతుందని వెల్లడించారు.  న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో  శాంతించారు.  మృతుడు గంగయ్య బంధువులు, దమ్మన్నపేట గ్రామస్థులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-29T05:22:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising