మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలి
ABN, First Publish Date - 2022-08-29T05:22:14+05:30
గంభీరావుపేట మండలం మల్లుపల్లె కమాన్ వద్ద రోడ్డుపై దమ్మన్నపేట వాసులు ఆదివారం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఇదే స్థలంలో శనివారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దమ్మన్నపేట వాసి ఆవునూరి గంగయ్య కుటుంబానికి న్యాయం చేయాలని బైఠాయించారు.
- దమ్మన్నపేట వాసుల ఆందోళన
గంభీరావుపేట, ఆగస్ట్ 28 : గంభీరావుపేట మండలం మల్లుపల్లె కమాన్ వద్ద రోడ్డుపై దమ్మన్నపేట వాసులు ఆదివారం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఇదే స్థలంలో శనివారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దమ్మన్నపేట వాసి ఆవునూరి గంగయ్య కుటుంబానికి న్యాయం చేయాలని బైఠాయించారు. అతి వేగంతో కారు ఢీకొట్టడంతోనే గంగయ్య మృతి చెందాడని, ఈ సంఘటనపై పోలీస్లు స్పందించి రోడ్డు ప్రమాదానికి కారకుడైన వ్యక్తిని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి, సిరిసిల్ల ప్రధాన రహదారిపై పెద్ద ఎత్తున దమ్మన్నపేట గ్రామస్థులు బైఠాయించారు.గంటల తరబడి ఆందోళన జరగడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిచిలి పోయాయి. ఎల్లారెడ్డిపేట సీఐ మొగిలి, గంభీరావుపేట ఎస్సై మహేష్ ఆందోళన వద్దకు చేరి సముదాయించారు. మృతుడి కుటుంబానికి న్యాయంతోపాటు రోడ్డు ప్రమాదానికి బాధ్యుడైన వ్యక్తిని వెంటనే అదుపులోకి తీసుకునే వరకు ఆందోళన కొనసాగుతుందని వెల్లడించారు. న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో శాంతించారు. మృతుడు గంగయ్య బంధువులు, దమ్మన్నపేట గ్రామస్థులు పాల్గొన్నారు.
Updated Date - 2022-08-29T05:22:14+05:30 IST