రెండో రోజూ నిరవధిక దీక్ష
ABN, First Publish Date - 2022-07-04T06:10:57+05:30
ముస్తాబాద్ గ్రామ పంచాయతీ వద్ద కాంగ్రెస్ నాయకులు చేపట్టిన నిరవధిక సమ్మె రెండో రోజు ఆదివారం కొనసాగింది.
ముస్తాబాద్, జూలై 3: ముస్తాబాద్ గ్రామ పంచాయతీ వద్ద కాంగ్రెస్ నాయకులు చేపట్టిన నిరవధిక సమ్మె రెండో రోజు ఆదివారం కొనసాగింది. మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీ మేరకు 30 పడకల ఆస్పత్రి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఎంపీటీసీ గుండెల్లి శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు తాళ్ల విజయ్రెడ్డి, రంజానీ నరేష్, అరుట్ల మహేష్ నిరవధిక దీక్ష చేపట్టారు. కేటీఆర్ ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని డిమాండ్ చేశారు. కొత్తగా ముస్తాబాద్కు ఏమీ కోరుకోవడం లేదని, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నేరవేర్చాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎల్ల బాల్రెడ్డి, నాయకులు గజ్జెల రాజు, కొండం బాల్రెడ్డి, ఉచ్చిడి బాల్రెడ్డి, దీటి నర్సింహులు, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-07-04T06:10:57+05:30 IST