సాధారణ ప్రసవాలు పెంచండి
ABN, First Publish Date - 2022-05-17T05:16:50+05:30
డెలివరీ ఆపరేషన్లు తగ్గించి సాధారణ ప్రసవాలను పెంచాలని గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఆర్ఎంఓ బీష్మ వైద్య సిబ్బందికి సూ చించారు.
- ఆర్ఎంఓ బీష్మ
కళ్యాణ్నగర్, మే 16: డెలివరీ ఆపరేషన్లు తగ్గించి సాధారణ ప్రసవాలను పెంచాలని గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఆర్ఎంఓ బీష్మ వైద్య సిబ్బందికి సూ చించారు. సోమవారం గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో గోదావరిఖని, మంథనికి చెందిన నర్సింగ్ సిబ్బందికి సాధారణ ప్రసవాలపై అవగాహన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భిణీలకు సాధారణ ప్రసవాలపై అవగాహన కల్పించాలని, సిజేరియన్లతో కలిగే దుష్పరిణామాలను వివరించాలని, గర్భం దాల్చిన 3వ నెల నుంచే వారికి మిడ్వైఫ్ ఆధ్వర్యంలో యోగాతో పాటు సరైన డైట్ తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ఆస్రా, నర్సింగ్ సూపరింటెండెంట్ జమున, మిడ్వైఫ్ సరళ పాల్గొన్నారు.
Updated Date - 2022-05-17T05:16:50+05:30 IST