ఘనంగా వైకుంఠ చతుర్ధశి
ABN, First Publish Date - 2022-11-07T00:01:59+05:30
వైకుంఠ చతుర్ధశి వేడుకలను వేములవాడ రాజరాజేశ్వరక్షేత్రంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్ ఆధ్వర్యంలో అర్చకులు, వేదపండితులు ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.
- సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారికి మహాపూజ
- కన్నుల పండువగా పొన్నసేవ ఊరేగింపు
వేములవాడ, నవంబరు 6 : వైకుంఠ చతుర్ధశి వేడుకలను వేములవాడ రాజరాజేశ్వరక్షేత్రంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్ ఆధ్వర్యంలో అర్చకులు, వేదపండితులు ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం కార్తీక శుద్ధ త్రయోదశి, అనంతరం వైకుంఠ చతుర్దశి కలిసిరావడంతో ప్రధాన ఆలయంతోపాటు అనుబంధ ఆలయాలైన భీమేశ్వరస్వామి, నగరేశ్వరస్వామి, కేదారేశ్వరస్వామి, సోమేశ్వరస్వామి ఆలయాల్లో అన్నపూజ నిర్వహించారు. రాత్రి అనంతపద్మనాభస్వామివారికి పంచోపనిషత్ ద్వారాభిషేకం, శ్రీవల్లీ సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి మహాపూజ వంటివి చేపట్టారు. పొన్నచెట్టుసేవపై స్వామివారలను పట్టణ వీధుల్లో ఊరేగించారు.
Updated Date - 2022-11-07T00:02:04+05:30 IST