మహనీయుల ఆశయ సాధనకు కృషి
ABN, First Publish Date - 2022-05-23T06:01:04+05:30
మహనీయుల ఆశయసాధన దిశగా అందరూ కృషి చేయాలని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు.
- అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ
పెద్దపల్లి కల్చరల్, మే 22 : మహనీయుల ఆశయసాధన దిశగా అందరూ కృషి చేయాలని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు. శ్రీభాగ్యరెడ్డివర్మ జయంతిని పురస్కరించుకొని ఆదివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ జ్యోతిప్రజ్వలన చేసి ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. భాగ్య రెడ్డివర్మ దళిత వైతాళికుడు, సంఘ సంస్కర్త, ఆది ఆంధ్ర సభ స్థాపకులని అదనపు కలెక్టర్ కొనియాడారు. మాదరి భాగయ్య సమాజంలోని కుల వివక్షను, అణచివేతను భరించి, వాటి నుంచి విముక్తి కోసం నిరక్షరాస్యులైన దళిత బాలికల కోసం 26 పాఠ శాలలు స్థాపించారని తెలిపారు. ఆది ఆంధ్ర సభ స్థాపించి ప్రజలను సంఘటితం చేశారన్నారు. దేవదాసి, జోగిని వంటి దురాచారాలను తొలగించేందుకు ఎనలేని కృషి చేశారని తెలిపారు. కులాంతర వివాహాలను ప్రోత్సాహించారని అన్నారు. ప్రభు త్వ ఆదేశాల మేరకు ఆ మహనీయుని జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నా మని, ఆయన ఆశయ సాధన దిశగా అందరూ కృషి చేయాలని ప్రజలకు పిలుపుని చ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి నాగైలేశ్వర్, వివిధ దళిత సంఘాల నాయకులు, కలెక్టరేట్ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.
Updated Date - 2022-05-23T06:01:04+05:30 IST