ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ధర్నా

ABN, First Publish Date - 2022-05-25T06:21:32+05:30

ధాన్యం కొనుగోళ్లు, తరలింపులో జాప్యాన్ని నిరసిస్తూ ఎల్లారెడ్డిపేట తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు నర్సయ్య ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు.

వినతి పత్రం అందజేస్తున్న నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎల్లారెడ్డిపేట, మే 24:  ధాన్యం కొనుగోళ్లు, తరలింపులో జాప్యాన్ని నిరసిస్తూ ఎల్లారెడ్డిపేట తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు నర్సయ్య ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు.  ఈ సందర్భంగా నర్సయ్య మాట్లాడుతూ కొనుగోళ్లు, ధాన్యం తరలింపులో  ప్రభుత్వం, అధికారులు, ప్రజాప్రతినిధులు విఫలమయ్యారని ఆరోపించారు. రైతులు కేంద్రాల్లోనే పడిగాపులు కాయాల్సిన దుస్థితి దాపురిస్తోందన్నారు. ఇసుక రవాణా చేస్తున్న లారీలను కట్టడి చేయాలని, ధాన్యాన్ని తరలించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. బస్తాకు 43 కిలోల ధాన్యం తూకం వేస్తూ రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. అనంతరం తహసీల్‌ అధికారులకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు గిరిధర్‌రెడ్డి, శ్రీనివాస్‌, మధు, పోచయ్య, రాములు, రవీందర్‌, రాజునాయక్‌, సత్తయ్య, దేవయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-25T06:21:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising