రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ
ABN, First Publish Date - 2022-01-24T06:13:45+05:30
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పార్వతీపరమేశ్వరులను దర్శించుకున్నారు.
వేములవాడ టౌన్, జనవరి 23: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పార్వతీపరమేశ్వరులను దర్శించుకున్నారు. అనంతరం అనుబంధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు కొవిడ్ నేపథ్యంలో రాజన్న ఆలయంలోకి వచ్చే భక్తులకు సిబ్బంది టెంపరేచర్ పరీక్షించారు. మాస్కు లేని భక్తులను ఆలయంలోకి వెళ్లేందుకు అనుమతించలేదు. మాస్కు ధరించాలని సిబ్బంది భక్తులకు అవగాహన కల్పించారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయాధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
Updated Date - 2022-01-24T06:13:45+05:30 IST