మాపై దాడి చేసే పర్మిషన్ ఎవరిచ్చారు?: బండి
ABN, First Publish Date - 2022-01-03T03:48:58+05:30
కరీంనగర్: జీవో 317 సవరించాలంటూ తాను చేస్తున్న జాగరణ దీక్షను అడ్డుకుని తన క్యాంప్ ఆఫీస్కు వచ్చి దాడి చేసే పర్మిషన్ ఎవరిచ్చారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు.
కరీంనగర్: జీవో 317 సవరించాలంటూ తాను చేస్తున్న జాగరణ దీక్షను అడ్డుకుని తన క్యాంప్ ఆఫీస్కు వచ్చి దాడి చేసే పర్మిషన్ ఎవరిచ్చారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని, దీక్ష చేస్తుంటే అడ్డుకోవడం దారుణమని ఆయన విమర్శించారు. కరోనా నిబంధనల పేరుతో అడ్డుకోవాలని చూస్తున్నారని, రూల్స్ అధికార పక్షానికి ఉండవా అని బండి నిలదీశారు . బీజేపీ కార్యకర్తలపై చేయి చేసుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు. తనను పోలీసులు అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని బండి సంజయ్ చెప్పారు. మరోవైపు పోలీసులు బండి సంజయ్ దీక్ష చేస్తున్న క్యాంప్ కార్యాలయాన్ని చుట్టుముట్టారు. కార్యాలయం తాళం బద్దలు కొట్టేందుకు యత్నించారు. కార్యాలయం గేటును పగలకొట్టారు. గ్యాస్ కట్టర్తో గేటును తొలగించేందుకు యత్నించారు.
Updated Date - 2022-01-03T03:48:58+05:30 IST