భక్తులతో మర్యాదగా ప్రవర్తించాలి
ABN, First Publish Date - 2022-02-28T06:33:06+05:30
మహాశివరాత్రి జాతర సందర్భంగా వేములవాడకు వచ్చే భక్తులతో మర్యాదరగా ప్రవర్తించాలని ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు.
ఎస్పీ రాహుల్ హెగ్డే
వేములవాడ, ఫిబ్రవరి 27 : మహాశివరాత్రి జాతర సందర్భంగా వేములవాడకు వచ్చే భక్తులతో మర్యాదరగా ప్రవర్తించాలని ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. మహాశివరాత్రి జాతర బందోబస్తు విధుల కోసం వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన పోలీసు అధికారులు, సిబ్బందితో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలన్నారు. క్రమశిక్షణ, సమయపాలన పాటించాలన్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ చంద్రకాంత్, పట్టణ సీఐ వెంకటేశ్, రూరల్ సీఐ బన్సీలాల్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-02-28T06:33:06+05:30 IST