Bandi Sanjay: తెలంగాణను అందరూ శ్రీలంకలా ఊహించు కుంటున్నారు
ABN, First Publish Date - 2022-08-25T16:31:38+05:30
సీఎం కేసీఆర్ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యను సృష్టించడం సిగ్గు చేటని బండి సంజయ్ అన్నారు.
కరీంనగర్ (Karimnagar): శాంతి భద్రతలను కాపాడాల్సిన సీఎం కేసీఆర్ (CM KCR).. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యను సృష్టించడం సిగ్గు చేటని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ మేధావులు, ప్రజలు ఈ నిర్బంధాలు గమనించాలన్నారు. అందరూ తెలంగాణను శ్రీలంకలా (Srilanka) ఊహించు కుంటున్నారని, మునావర్ ఫారూఖ్ (Munawar Farooq) ఆహ్వానంలో ముఖ్యమంత్రి కొడుకు కేటీఆర్ (KTR) పాత్ర ఉందని ఆరోపించారు. పాతబస్తీని అభివృద్ధి చేయడం లేదని, ఎంఐఎం (MIM) మత విద్వేషాలు రెచ్చ గొట్టి.. ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. అన్ని మతాలు బాగుండాలని బీజేపీ (BJP) చెప్పే విషయాలు ముస్లింలు కూడా ఆలోచిస్తున్నారన్నారు. టీఆర్ఎస్, ఎంఐఎం కలిసి మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్లాన్ చేస్తున్నాయని బండి సంజయ్ ఆరోపించారు.
Updated Date - 2022-08-25T16:31:38+05:30 IST