ప్రభుత్వాస్పత్రి ఎదుట ఆశావర్కర్ల నిరసన
ABN, First Publish Date - 2022-06-26T06:36:59+05:30
గంభీరావుపేట ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో శనివారం పనిభారం తగ్గించాలని ఆశావర్కర్లు నిరసన వ్యక్తం చేశారు.
గంభీరావుపేట, జూన్ 25 : గంభీరావుపేట ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో శనివారం పనిభారం తగ్గించాలని ఆశావర్కర్లు నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమానికి హాజరైన సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ మాట్లాడుతూ ప్రభుత్వం ఆశావర్కర్లకు పనిభారం పెంచిందని, ఫలితంగా ఆశావర్కర్లు అనేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైన ఆశావర్కర్లకు పనిభారం తగ్గించాలని డిమాండ్ చేశారు. నిరసనలో పలువురు ఆశావర్కర్లు పాల్గొన్నారు.
Updated Date - 2022-06-26T06:36:59+05:30 IST