ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కామారెడ్డిలో తల్లీకొడుకుల ఆత్మహత్య ఘటనపై గవర్నర్ సీరియస్

ABN, First Publish Date - 2022-04-23T16:35:58+05:30

జిల్లా కేంద్రంలోని మహారాజా లాడ్జిలో రామాయంపేటకు చెందిన తల్లీ కొడుకులు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై గవర్నర్ తమిళిసై ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కామారెడ్డి: జిల్లా కేంద్రంలోని మహారాజా లాడ్జిలో రామాయంపేటకు చెందిన తల్లీ కొడుకులు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై గవర్నర్ తమిళిసై ఆగ్రహం వ్యక్తం చేశారు.  అధికార పార్టీకి చెందిన నేతలు, పోలీసులు వేధించడం వల్లే ఆత్మహత్య చేసుకున్నారన్న విమర్శలపై గవర్నర్ ఆరా తీశారు. లొంగిపోయిన ఆరుగురు నిందితులపై 216,306,34 సెక్షన్ల కింద నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ కాపీ, పోలీసులు నిర్ధారించిన దర్యాప్తు వివరాలు, రిమాండ్ రిపోర్ట్‌లను గవర్నర్ తమిళిసైకి జిల్లా పోలీస్ శాఖ నివేదించినట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి ఏ7 గా ఉన్న సీఐ నాగార్జున గౌడ్(తుంగతుర్తి)ను పోలీసులు విచారించారు. సీఐపై శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. 

Updated Date - 2022-04-23T16:35:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising