ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kaleswaram: వల్లే గోదావరికి ముంపు పెరిగింది: డీకే అరుణ

ABN, First Publish Date - 2022-07-22T22:49:15+05:30

కాళేశ్వరం(Kaleswaram) ప్రాజెక్టు డిజైన్ లోపాల వల్లే గోదావరి(Godavari)కి ముంపు పెరిగిందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ(DK ARUNA) అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంచిర్యాల: కాళేశ్వరం(Kaleswaram) ప్రాజెక్టు డిజైన్ లోపాల వల్లే గోదావరి(Godavari)కి ముంపు పెరిగిందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ(DK ARUNA) అన్నారు. శుక్రవారం అరుణ మంచిర్యాలలో పర్యటించారు. ఈసందర్భంగా అరుణ మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ముంపు ప్రాజెక్టుగా మారిందన్నారు. వేల ఎకరాల్లో పంటలు, పల్లెలు మునగడానికి టీఆర్ఎస్ ప్రభుత్వ (TRS GOVT) అనాలోచిత విధానాలే కారణమని మండిపడ్డారు.ఇతర రాష్ట్రాల్లో రైతులకు సహాయం అందించే సీఎం కేసీఆర్‌(CM KCR)కు ఇక్కడి ప్రజల కన్నీళ్లు మాత్రం కనిపించడం లేదన్నారు. సొంత రాష్ట్ర రైతులకు కన్నీళ్లను మిగిల్చిన ముఖ్యమంత్రిగా కేసీఆర్ చరిత్రలోకి ఎక్కారని చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అన్న సందేహం ప్రజల్లో నెలకొందన్నారు.నూతనంగా నిర్మించిన మాత శిశు ఆస్పత్రి వరద ముంపునకు గురవడం కేసీఆర్ ముందుచూపునకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. తక్షణమే వరద బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని డీకే అరుణ డిమాండ్ చేశారు.

Updated Date - 2022-07-22T22:49:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising