రాహుల్గాంధీ పిలుపుతో ఢిల్లీ వెళ్లిన జగ్గారెడ్డి
ABN, First Publish Date - 2022-04-04T01:12:09+05:30
ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఢిల్లీకి బయలు దేరారు. ఆయనతో పాటు ఆయన సతీమణి, సంగారెడ్డి డీసీసీ అధ్యక్షురాలు నిర్మల, కూతురు, కుమారుడు ఉన్నారు.
సంగారెడ్డి: ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఢిల్లీకి బయలు దేరారు. ఆయనతో పాటు ఆయన సతీమణి, సంగారెడ్డి డీసీసీ అధ్యక్షురాలు నిర్మల, కూతురు, కుమారుడు ఉన్నారు. ఢిల్లీలో సోమవారం జరగనున్న తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతల సమావేశానికి రావాల్సిందిగా ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీ నుంచి జగ్గారెడ్డికి పిలుపు వచ్చిన విషయం తెలిసిందే. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిపై ఇటీవలి కాలంలో తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన జగ్గారెడ్డి.. సోమవారం నాటి సమావేశంలో ఎలా వ్యవహరిస్తారోనన్న ఆసక్తి కాంగ్రెస్ వర్గాల్లో నెలకొన్నది.
Updated Date - 2022-04-04T01:12:09+05:30 IST