ముందస్తూ ఉండదు...వెనకస్తూ రాదు: జగదీష్రెడ్డి
ABN, First Publish Date - 2022-01-22T20:08:20+05:30
రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయని ప్రతిపక్షాలు చెబుతున్న ప్రకటనలను మంత్రి జగదీష్రెడ్డి ఖండించారు. ముందస్తూ ఉండదు...
హైదరాబాద్: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయని ప్రతిపక్షాలు చేస్తున్న ప్రకటనలను మంత్రి జగదీష్రెడ్డి ఖండించారు. ముందస్తూ ఉండదు... వెనకస్తూ రాదని తేల్చిచెప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ పాలనలో సంక్షేమం లేదు... అభివృద్ధి జరగదని తప్పుబట్టారు. సీఎం కేసీఆర్ విజన్కు బీజేపీ 100 మైళ్ళ దూరంలో ఉందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో వికలాంగులకు ఇస్తున్న ఫించన్ ఎంత? అని ప్రశ్నించారు. రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి ఎక్కడైనా అమలు చేస్తున్నారా అని నిలదీశారు. గుజరాత్లో మోదీ ఇంటింటికి మంచినీరు కూడా అందించలేదని జగదీష్రెడ్డి విమర్శించారు.
Updated Date - 2022-01-22T20:08:20+05:30 IST