Flag hoisting: తెలంగాణ అసెంబ్లీ, మండలిలో జాతీయ జెండా ఆవిష్కరణ
ABN, First Publish Date - 2022-08-15T13:53:55+05:30
భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తెలంగాణ శాసన మండలి ప్రాంగణంలో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు.
హైదరాబాద్: భారత స్వాతంత్ర్య దినోత్సవం (Indipendence day) సందర్భంగా తెలంగాణ శాసన మండలి ప్రాంగణంలో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutta sukhender reddy) జాతీయ జెండాను ఆవిష్కరించారు. అటు అసెంబ్లీలో జాతీయ జెండాను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి (Pocharam srinivas reddy)ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు తక్కెళ్ళపల్లి రవీందర్ రావు (Takkellapalli ravinder rao), దయానంద్ (Dayanand), దండే విఠల్ (Dande vittal), జనార్దన్ రెడ్డి(Janardhan reddy),రఘోత్తమ్ రెడ్డి (Raghottam reddy), నవీన్ కుమార్ (Naveen kumar), తెలంగాణ లెజిస్లేచర్ సెక్రెటరీ వి.నరసింహా చార్యులు (C.narasimha charyulu), టీఆర్ఎస్ఎల్పీ కార్యదర్శి రమేష్ రెడ్డి (Ramesh reddy), తదితరులు హాజరయ్యారు.
Updated Date - 2022-08-15T13:53:55+05:30 IST