ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చంద్రబాబు కుటుంబంపై అనుచిత పోస్టులు.. వ్యక్తిని రోడ్డుపైకి ఈడ్చుకొచ్చి కొట్టిన టీడీపీ నేతలు

ABN, First Publish Date - 2022-09-30T04:34:03+05:30

సోషల్ మీడియాలో చంద్రబాబు కుటుంబం (Chandrababu Family)పై అనుచిత పోస్టులు చేసిన వ్యక్తికి టీడీపీ (Tdp) నేతలు దేహశుద్ధి చేశారు. రోడ్డుపైకి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖమ్మం: సోషల్ మీడియాలో చంద్రబాబు కుటుంబం (Chandrababu Family)పై అనుచిత పోస్టులు చేసిన వ్యక్తికి టీడీపీ (Tdp) నేతలు దేహశుద్ధి చేశారు. రోడ్డుపైకి ఈడ్చుకుంటూ వచ్చి చెంప చెళ్లుమనిపించారు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. కృష్ణా జిల్లా ఘంటశాలకు చెందిన ఆర్ఎంపీ వైద్యుడు కోదాటి నరసింహ వైసీపీ (Ycp) కార్యకర్తగా పని చేస్తున్నారు. ఖమ్మంలోని టేకులపల్లిలో నివాసం ఉంటున్నాడు. కొంతకాలంగా సామాజిక మాధ్యమాల(Social Media)లో చంద్రబాబు కుటుంబానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో నారా బ్రాహ్మణి (Nara Brahmani), భువనేశ్వరి (Bhuvaneshwari)ని ఉద్దేశించి అసభ్యకరంగా కామెంట్స్ పోస్టు చేశారు. నరసింహను పలుమార్లు టీడీపీ నాయకులు హెచ్చరించినా తీరు మార్చుకోలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ శ్రేణులు నరసింహపై దాడి చేశారు. ఎవరైనా సరే చంద్రబాబు కుటుంబ సభ్యులపై అసభ్యపదజాలంతో ట్రోలింగ్ చేస్తే సహించేదిలేదని హెచ్చరించారు. 



Updated Date - 2022-09-30T04:34:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising