తరలివచ్చిన ఉత్తర భారతీయులు
ABN, First Publish Date - 2022-07-04T10:04:50+05:30
విజయ సంకల్ప సభ మినీ ఇండియాను తలపించింది. గతంలో తెలంగాణలో ఎన్నో బహిరంగ సభలు జరిగినా, తాజా సభ వాటికి భిన్నంగా కనిపించింది.
సికింద్రాబాద్, జూలై 3(ఆంధ్రజ్యోతి): విజయ సంకల్ప సభ మినీ ఇండియాను తలపించింది. గతంలో తెలంగాణలో ఎన్నో బహిరంగ సభలు జరిగినా, తాజా సభ వాటికి భిన్నంగా కనిపించింది. ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు, ఎంపీలు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరవడంతో వారిని చూసేందుకు నగరంలోని సికింద్రాబాద్లోని రాణిగంజ్, జనరల్బజార్, టకార బస్తీ, మోండా మార్కెట్కు చెందిన మార్వాడీలు, ఉత్తర భారతీయులు కుటుంబ సభ్యులు సహా పరేడ్గ్రౌండ్కు వచ్చారు. చాలామంది కాషాయ వస్త్రధారణతో ఆకట్టుకున్నారు. మోదీ ఫొటోతో కూడిన మాస్కులు, పగడీలు, ప్లకార్డులతో సందడి చేశారు.
Updated Date - 2022-07-04T10:04:50+05:30 IST